![మనోధైర్యమే మందు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/05/09HSB03.jpg?fit=846%2C789&ssl=1)
– సైకాలజిస్టు ఎజ్రా మల్లేశం
సారథి, రామడుగు: మనోధైర్యమే శ్రీరామ రక్ష అని సైకాలజిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సైక్రాలజిస్టు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఫోన్ కౌన్సిలింగ్ నిర్వహించి మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం అవుతున్న తరునంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఆత్మ విశ్వాసాన్ని నింపుకోవాలన్నారు. స్వీయ నియంత్రణతోనే భయంకర మహమ్మారిని తరిమికొట్టచ్చన్నారు. ఎవరైన వ్యాధుల పట్ల భయం, నిరాశ నిస్పృహలతో ఉన్నట్లైతే సైకాలజిస్టులను సంప్రదించాలని కోరారు.