![అట్టహాసంగా ప్రమాణ స్వీకారం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2022/01/kk4.jpg?fit=655%2C411&ssl=1)
సామాజికసారథి, నాగర్కర్నూల్ ప్రతినిధి: నూతన ఎన్నికైన ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్రెడ్డి, కల్వకుంట్ల కవిత బుధవారం కౌన్సిల్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ, వారిచేత అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యఅతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కాగా, ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూచకుళ్ల దామోదర్రెడ్డి, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి కుమారులు తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి, కోడలు సరిత, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. కాగా, ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ దామోదర్రెడ్డిని ఎంపీపీ నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాసులు, నాగనూరు కృష్ణారెడ్డి, రేణుబాబు, శ్రీనివాస్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2022/01/kk3.jpg?resize=640%2C413&ssl=1)
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2022/01/kk2.jpg?resize=640%2C448&ssl=1)