![అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/mdk1.jpg?fit=677%2C253&ssl=1)
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట రైతువేదికలో రైతుబంధు సమితి క్యాలెండర్లను ఎంపీపీ జంగం శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఇన్చార్జ్ వ్యవసాయాధికారి అమృత్ మాట్లాడుతూ.. పంటల మార్పిడిలో భాగంగా రైతు సోదరులు అపరాల పంటలైన మినుములు, పెసళ్లు, నూనెగింజల పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు పూలు వంటి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పంటలకు అడవి పందుల భయం ఉన్నట్లయితే ఆ గ్రామసర్పంచ్కు ఫిర్యాదు చేయాలని, శిక్షణ ఉన్న షూటర్ సహాయంతో అడవి పందులను చంపివేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సురేష్ గౌడ్, మండల తహసీల్దార్, గ్రామ రైతుబంధు సమితి కోఆర్డినేటర్, ఎంపీటీసీ, సర్పంచ్లు, వ్యవసాయ విస్తరణాధికారి రాజు, రైతులు పాల్గొన్నారు.