![రాజన్నసన్నిధిలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/vmd1.jpg?fit=655%2C332&ssl=1)
సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరుప్రతిష్టలు పొంది కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఏకైక కైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి లడ్డూప్రసాదం అందజేసి సత్కరించారు.