![గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/EXAMS1.jpg?fit=677%2C372&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి మే 30న ప్రవేశపరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్నంబర్, ఆధార్నంబర్ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.100 కాగా, 2020–21 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుకున్నవారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఫలితాల అనంతరం మెరిట్ ఆధారంగా విద్యార్థులకు గురుకులంలో అడ్మిషన్ ఇస్తారు. మరిన్నివివరాలకు www.tswreis.in వెబ్సైట్కు సంప్రదించవచ్చు. వివరాలు తెలుసుకునేందుకు 180042545678 నంబర్ను కేటాయించారు.