Breaking News

గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి మే 30న ప్రవేశపరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్​ విడుదలైంది. మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్​3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్​నంబర్, ఆధార్​నంబర్​ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.100 కాగా, 2020–21 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుకున్నవారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఫలితాల అనంతరం మెరిట్​ ఆధారంగా విద్యార్థులకు గురుకులంలో అడ్మిషన్​ ఇస్తారు. మరిన్నివివరాలకు www.tswreis.in వెబ్​సైట్​కు సంప్రదించవచ్చు. వివరాలు తెలుసుకునేందుకు 180042545678 నంబర్​ను కేటాయించారు.