Breaking News

50ఏళ్లలో 4,58 కోట్ల మంది మిస్సింగ్​

50ఏళ్లలో 4,58 కోట్ల మంది మిస్సింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఫలానా పట్టణంలో బాలిక అదృశ్యం.. ఫలానా గ్రామం నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరు మహిళలు. పాఠశాల నుంచి మాయమైన విద్యార్థినులు.. ఇలాంటి వార్తలు ప్రతిరోజూ పేపర్లు, టీవీల్లో చూస్తూనే ఉంటాం. ఇలా ఇంటినుంచి మాయమైన వారు దేశం మొత్తంలో లక్షో, పదిలక్షల మందో ఉంటారని అనుకుంటాం. కానీ, ఈ 50ఏళ్ల కాలంలో అలాంటివారు నాలుగు కోట్ల 58లక్షల మంది ఉన్నారట. అది కూడా మహిళలు. ఇంతమంది కనిపించకుండా పోయారట. ఇది కేవలం ఇండియాలోనే. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తున్నా దీని వెనక భయానకం దాగి ఉందో కదా.. ఈ లెక్క చెప్పింది ఎవరో కాదండి. ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా కనిపించకుండా పోయిన మహిళలు 14కోట్ల 26లక్షల మంది ఉంటే అందులో కేవలం ఇండియా వారే మూడోవంతు మంది ఉన్నారట.

ఇక చైనాలో అయితే ఆ సంఖ్య రూ.7.23 కోట్ల మంది ఉన్నారట. ఇది వింటుంటే అమ్మో భయంగా ఉంది కదా.. అసలు ఇలా ఇంతమంది మహిళలు ఎందుకు కనిపించకుండా పోయారు. వారంతా ఎక్కడ.. ఎలా ఉన్నారు. అసలు ఎందుకు వీరు ఇళ్లనుంచి వెళుతున్నారు. వారంతా ఎలాంటి కష్టాలు పడుతున్నారన్న ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. ఆ మహిళలు కనపడకుండా పోవడంతో ఆ కుటుంబాలు ఎంతో ఆవేదనతో ఉన్నాయి.