![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/short-news-1.jpg?fit=373%2C280&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: వానకాలం పంట సాగు ప్రణాళిక, నియంత్రిత వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలు క్లస్టర్ల వారీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 26న రామడుగు, శానగర్, 27న గోపాల్ రావుపేట్, రుద్రారం, 28న వెలిచాల, దేశరజ్ పల్లి గ్రామాల్లో నిర్వహిస్తామని చెప్పారు. రైతులు తప్పకుండా హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.