![250 పేద కుటుంబాలకు సాయం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/IMG-20200424-WA0089.jpg?fit=1280%2C853&ssl=1)
సారథి న్యూస్, మెదక్: లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్
వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ 13వ వార్డు లో 250 కుటుంబాలకు రూ.మూడు లక్షల నగదుతో నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తూప్రాన్ కౌన్సిలర్లు, శ్రీనివాస యువసేన సభ్యులు పాల్గొన్నారు.