Breaking News

2021 లో వరల్డ్ చాంపియన్​ షిప్​

2021 లో వరల్డ్ చాంపియన్​ షిప్​
  • వెల్లడించిన బీడబ్ల్యూఎఫ్  

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగాల్సిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్​ షిప్​ ను రీ షెడ్యూల్ చేశారు. వాస్తవానికి 2021 ఆగస్ట్​లో స్పెయిన్​ లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ ఒలింపిక్స్ ఉండడంతో క్లాష్ రావొద్దని రీ షెడ్యూల్ చేశారు. వచ్చే ఏడాది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 మధ్య పోటీలు నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది.

కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడడంతో తొలిసారి ఈ టోర్నీ ఒలింపిక్స్​ ఏడాదిలో జరగనుంది. దీంతో పీవీ సింధు వచ్చే ఏడాది వరకూ వరల్డ్ చాంపియన్​ గా కొనసాగనుంది. మరోవైపు కరోనా దెబ్బకు టోర్నీలు ఆగిపోవడంతో బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్​ ను ఫ్రీజ్ చేశారు.

మార్చి 17వ తేదీ నాటికి ఉన్న ర్యాంక్లను యథాతధంగా నిలిపి ఉంచనున్నారు. 2021లో జరగాల్సిన టోర్నీలతో పాటు ఒలింపిక్స్ అర్హత టోర్నీలపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని అంతర్జాతీయ బాడీ తెలిపింది.