Breaking News

హెచ్​బీటీలను ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: తమను ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర మోడల్​ స్కూల్​, కాలేజ్​లో పనిచేస్తున్న అవర్లీ బేస్డ్​ టీచర్లు (హెచ్​బీటీ) శుక్రవారం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్​కు వినతిపత్రం సమర్పించారు. లాక్​డౌన్​ కాలం నుంచి జీతాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం నాయకులు ప్రశాంత్​, శ్రీనివాస్​, పూర్ణచందర్​, గణపతి, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.