
సారథిన్యూస్, రామడుగు: తమను ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్, కాలేజ్లో పనిచేస్తున్న అవర్లీ బేస్డ్ టీచర్లు (హెచ్బీటీ) శుక్రవారం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్కు వినతిపత్రం సమర్పించారు. లాక్డౌన్ కాలం నుంచి జీతాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం నాయకులు ప్రశాంత్, శ్రీనివాస్, పూర్ణచందర్, గణపతి, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.