సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం నర్సాపూర్ లో మున్సిపాలిటీ ఆఫీసులో మున్సిపల్ కార్మికులకు కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే లాక్ డౌన్ పక్కాగా అమలు చేయడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
- April 22, 2020
- లోకల్ న్యూస్
- కరోనా
- కార్మికులు
- మున్సిపల్
- మెదక్ కలెక్టర్
- Comments Off on స్వీయ నియంత్రణ బాధ్యత