Breaking News

సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​

సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​

  • 100 మందికి మించకుండా సభలు, సమావేశాలు
  • సెప్టెంబర్‌ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు
  • చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఇళ్లకే పరిమితం
  • కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు జారీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ తెరవకూడదని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అలాగే పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు ఇచ్చింది. కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దశలవారీగా మెట్రోసేవల ప్రారంభానికి అనుమతినిచ్చింది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని స్పష్టంచేసింది.

కొన్ని కీలకమైన నిర్ణయాలు
–దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి.
– దశలవారీగా మెట్రో సర్వీసులకు అనుమతి.
– సెప్టెంబర్ 30 వరకు విద్యాసంస్థలు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ఎన్యూస్ మెంట్ పార్కుల మూసివేత
– కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100 మందికి మించకుండా సభలు, సమావేశాలకు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అనుమతి
– అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
– చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు సెప్టెంబర్ 30 వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించిన కేంద్ర ప్రభుత్వం

One thought on “సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​”

Comments are closed.