Breaking News

సామాజిక దూరం తప్పనిసరి

సామాజిక దూరం తప్పనిసరి

–    ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్​ రితిరాజ్

సారథి న్యూస్, షాద్ ​నగర్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా షాద్​నగర్​ పట్టణ ప్రజలు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్​ రితిరాజ్ సూచించారు. కరోనా నివారణపై 8వ తరగతి విద్యార్థిని లోకేశ్వరి రూపొందించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. కిరాణాషాపులు, ఇతర సముదాయాల వద్ద  ప్రజలు తప్పకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.