![సామాజిక దూరం తప్పనిసరి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/sdnr.jpeg?fit=987%2C614&ssl=1)
– ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్
సారథి న్యూస్, షాద్ నగర్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా షాద్నగర్ పట్టణ ప్రజలు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్ సూచించారు. కరోనా నివారణపై 8వ తరగతి విద్యార్థిని లోకేశ్వరి రూపొందించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. కిరాణాషాపులు, ఇతర సముదాయాల వద్ద ప్రజలు తప్పకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.