![సమష్టిగా పనిచేసి బొగ్గు ఉత్పత్తి పెంచాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/rgd-2.jpg?fit=677%2C324&ssl=1)
సారథి న్యూస్, రామగుండం: ఉద్యోగులంతా సమష్టిగా కలిసి పనిచేసి బొగ్గు ఉత్పాదక పనులను వేగవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం 11వ బొగ్గు గనిలో కంటిన్యూస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత సంబంధించి జీఎం నారాయణ, గని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో 11 గ్రూప్ ఏజెంట్ మనోహర్, మేనేజర్ నెహ్రూ, గ్రూప్ ఇంజనీర్ రామదాసు, సర్వే అధికారి నారాయణ, వెంటిలేషన్ ఆఫీసర్ జాన్సన్, జెమ్ కో ప్రాజెక్ట్ మేనేజర్ నరసింహారావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.