Breaking News

సడక్ సక్కగైంది.. జాగ్రత్త

ఎమ్మెల్యే మదన్ రెడ్డి

సారథి న్యూస్, నర్సాపూర్: ‘నర్సాపూర్ మెదక్ హైవే పనులు పూర్తయినయ్​.. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని’ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సూచించారు. బుధవారం కొల్చారం మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పోతంశెట్టిపల్లి వద్ద ఫోర్ లేన్ రోడ్డు పనులను ప్రారంభించారు. సరుకుల పంపిణీకి సహకరించిన సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్​ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులు పూర్తయిన నాటినుంచి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నెమ్మదిగా వెళ్లాలని, రోడ్డు నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ ఎంపీపీ, జడ్పీటీసీ పాల్గొన్నారు.