సారథి న్యూస్, కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 85,230 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,259 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా…ప్రస్తుతం నీటి మట్టం 853.80 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను… ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 88.8820 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
- July 27, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- PROJECT
- SRISILAM
- TMC
- టీఎంసీ
- ప్రాజెక్ట్
- శ్రీశైలం
- Comments Off on శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద