Breaking News

వృద్ధులకు మాస్కుల పంపిణీ

సారథి న్యూస్ నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలో వృద్ధులకు మాస్కులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో వృద్ధులకు మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు సర్పంచ్​ లింగంగౌడ్​ తెలిపారు. అనంతరం సర్పంచ్​ గ్రామంలో తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది రేణుక, సర్పంచ్​ లింగంగౌడ్​, ఉపసర్పంచ్​ మాధవి తదితరులు పాల్గొన్నారు.