![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/MASKKK.jpg?fit=1075%2C421&ssl=1)
సారథి న్యూస్ నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలో వృద్ధులకు మాస్కులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో వృద్ధులకు మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు సర్పంచ్ లింగంగౌడ్ తెలిపారు. అనంతరం సర్పంచ్ గ్రామంలో తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది రేణుక, సర్పంచ్ లింగంగౌడ్, ఉపసర్పంచ్ మాధవి తదితరులు పాల్గొన్నారు.