![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/viveka.jpg?fit=693%2C291&ssl=1)
సారథి న్యూస్, కరీంనగర్: స్వామి వివేకానంద సూక్తులు యువత పాటించాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా వెదిర క్రాస్రోడ్డు వద్ద వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జీవిత చరిత్రను అందరూ చదవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు బందారపు అజయ్ కుమార్ గౌడ్, ఎంపీటీసీ తొర్రి కొండ అనిల్ కుమార్, ఉపసర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, వీడీసీ చైర్మన్ రాజశేఖర్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ పైండ్ల శ్రీనివాస్, యువజన సంఘాల సమితి నాయకులు గజ్జల అశోక్, కొలిపాక కమలాకర్, పున్న కనకయ్య , అలువాల శంకర్, అంబటి వినోద్ , శ్రీ రామ్ సాయికుమార్, అర్జున్ ,పైండ్ల మధు, కొలిపాక కమల్, పోచంపల్లి నరేశ్, ఆవుదుర్తి సతీశ్, వినయ్, ఆనంద్ రెడ్డి, ప్రేమ్ చందు పాల్గొన్నారు.