Breaking News

విద్యతోనే వికాసం.. విజయం

విద్యతోనే వికాసం.. విజయం

సారథి న్యూస్, అలంపూర్: విద్యతోనే వికాసం.. విజయం సాధ్యమని ఫిట్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్​ఆర్ఎస్​ప్రసన్నకుమార్​అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల్లో ఆ రెండు సాధ్యమవుతున్నాయని చెప్పారు. విద్య లేకుంటే సమాజంలో గౌరవం ఉండదని, సమాజ స్థితిగతులు తెలియవని వివరించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో జనవరి 13,14వ తేదీల్లో జరిగే స్వేరో సంబరాల ప్రచార కార్యక్రమంలో భాగంగా శాంతినగర్ లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. గురుకులాల్లో చదువుతున్న పిల్లలు విద్య, సాంకేతికపరంగా ముందుకు దూసుకెళ్తున్నారంటే అది డాక్టర్​ ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​ఆలోచన, ఆచరణతోనే సాధ్యమైందన్నారు. ఒకనాడు చదువులకు దూరమైన సబ్బండవర్గాల పిల్లలు ఐఐటీ, ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లో ఈజీగా సీట్లు సాధిస్తున్నారని వివరించారు. ఆ అక్షరజ్ఞానం కోసమే స్వేరోల అక్షర యుద్ధం చేస్తున్నారని ప్రకటించారు. అందులో భాగంగానే జనవరి 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నస్వేరోస్​ సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి గురుకులాల కార్యదర్శి డాక్టర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ స్వేరోస్ ఎంసీ కేశవరావు, గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, శ్రీనివాస్, రాజు, సాగర్, లక్ష్మన్న పాల్గొన్నారు.

స్వేరోస్​ సంబరాల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న నాయకులు