![విద్యతోనే వికాసం.. విజయం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/SW2F.jpg?fit=677%2C345&ssl=1)
సారథి న్యూస్, అలంపూర్: విద్యతోనే వికాసం.. విజయం సాధ్యమని ఫిట్ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ఆర్ఎస్ప్రసన్నకుమార్అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల్లో ఆ రెండు సాధ్యమవుతున్నాయని చెప్పారు. విద్య లేకుంటే సమాజంలో గౌరవం ఉండదని, సమాజ స్థితిగతులు తెలియవని వివరించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో జనవరి 13,14వ తేదీల్లో జరిగే స్వేరో సంబరాల ప్రచార కార్యక్రమంలో భాగంగా శాంతినగర్ లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. గురుకులాల్లో చదువుతున్న పిల్లలు విద్య, సాంకేతికపరంగా ముందుకు దూసుకెళ్తున్నారంటే అది డాక్టర్ ఆర్ఎస్ప్రవీణ్కుమార్ఆలోచన, ఆచరణతోనే సాధ్యమైందన్నారు. ఒకనాడు చదువులకు దూరమైన సబ్బండవర్గాల పిల్లలు ఐఐటీ, ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లో ఈజీగా సీట్లు సాధిస్తున్నారని వివరించారు. ఆ అక్షరజ్ఞానం కోసమే స్వేరోల అక్షర యుద్ధం చేస్తున్నారని ప్రకటించారు. అందులో భాగంగానే జనవరి 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నస్వేరోస్ సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి గురుకులాల కార్యదర్శి డాక్టర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ స్వేరోస్ ఎంసీ కేశవరావు, గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, శ్రీనివాస్, రాజు, సాగర్, లక్ష్మన్న పాల్గొన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/RSP2.jpg?resize=640%2C366&ssl=1)