Breaking News

వాగులో ఒకరి గల్లంతు

వాగులో ఒకరు గల్లంతు

సారథి న్యూస్​, సిద్దిపేట: భారీ వర్షాలు కురుస్తున్న వేళ సిద్దిపేట జిల్లాలో ప్రమాదం సంభవించింది. సోమవారం నంగునూరు మండలం దర్గపల్లి గ్రామం సమీపంలో ఉన్న వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ముగ్గురిని ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో కాపాడారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ముగ్గురు మంథని వద్ద ఇసుక క్వారీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నందున క్వారీలోకి నీళ్లు రావడంతో అందరూ కలిసి తమ ఇళ్లకు వెళ్దామని కారులో బయలుదేరి వెళ్లారు. వరద ఉధృతిని అంచనా వేయలేకపోడంతో అందులో కొట్టుకుపోయారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి సీపీ జోయల్ డేవిస్ చేరుకుని పరిస్థిని సమీక్షిస్తున్నారు.