Breaking News

వందేళ్ల బామ్మ కరోనాను జయించింది

వందేళ్ల బామ్మ కరోనాను జయించింది

బళ్లారి: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా విస్తుగొలుపే వార్త. వందేళ్లు నిండిన ఓ బామ్మ కరోనాకు సోకింది. ఇంకేముంది కుటుంబసభ్యులు ఆశలు వదులుకున్నారు. కానీ విచిత్రంగా ఆ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నది. దీంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వ వైద్యులు ఆమెను ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు కోలుకున్నది. తాను ప్రతిరోజు ఓ ఆపిల్ తింటానని.. ఇదే తన ఆరోగ్యరహస్యమని వృద్ధురాలు మీడియాకు చెప్పింది.

.