![లాయర్ మిస్సింగ్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/lawyer.jpeg?fit=774%2C1032&ssl=1)
సారథి న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ కు చెందిన న్యాయవాది కొర్రి గంగాధర్ యాదవ్ ఈనెల 7 నుంచి కనిపించడం లేదు. మరుసటి రోజు బిర్కుర్ లోని తన తల్లి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని 3 టౌన్ ఎస్సై సంతోష్ కుమార్ శనివారం తెలిపారు.