Breaking News

లాక్ డౌన్ కు సహకరించిన వారికి కృతజ్ఞతలు

లాక్ డౌన్ కు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో గతంలో లాక్ డౌన్ కు సహకరించిన ప్రజలు, వ్యాపారులకు మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎస్సై సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్​లో సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, 9 రోజులుగా లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా నివారించగలిగామని అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని వ్యాపార సంస్థలు యథావిధిగా నడుపుకోవాలని సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ ​మండలాధ్యక్షుడు మురళి పంతులు, ఎంపీటీసీ సుభాష్ గౌడ్, విక్రమ్, వేణుగోపాల్ గౌడ్, ఉపసర్పంచ్ దశరథ్, పున్నయ్య, సలీమ్, యాదుల్, సాజిద్ పాల్గొన్నారు.