![](https://samajikasarathi.com/wp-content/themes/magazine-newspaper-pro/images/no-image.jpg)
–కలెక్టర్ వెంకట్రావు
సారథి న్యూస్, మహబూబ్ నగర్: అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారుల( ఏఈవో) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ ఎస్.వెంకట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఏఈవో అవుట్ సోర్సింగ్ పోస్టులు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా జిల్లాల కలెక్టర్లకు, జిల్లా వ్యవసాయ అధికారులకు పంపించామని, సంబంధిత జిల్లాలోని రోస్టర్ ప్రకారం జిల్లా కలెక్టర్లు పోస్టులను భర్తీచేస్తారని ఆయన స్పష్టంచేశారు.