Breaking News

రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

సారథి న్యూస్, మెదక్: రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి, మరో మహిళ బైక్​పై వచ్చి మాసాయిపేట బంగారమ్మ గుడి వద్ద చెట్టు కింద ఆగారు. కొద్దిసేపటి తర్వాత నిజామాబాద్ వైపు నుంచి గూడ్స్ రైలు రావడం గమనించి ఆ ఇద్దరు రైలు పట్టల మీద తలపెట్టి పడుకున్నారు. దీంతో వారి తలల మీద నుంచి రైలు వెళ్లడంతో శరీరాలు నుజ్జునుజ్జయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలంలో లభించిన ఐడీ కార్డు ఆధారంగా మృతుడు హైదరాబాద్ లోని మల్కాజిగిరి ప్రాంతంలోని మెడి ప్లస్ మెడికల్ స్టోర్​లో పనిచేసే సంగం రవికుమార్ గా గుర్తించారు. కాగా, అతనితో పాటు ఆత్మహత్య చేసుకున్న మహిళ ఎవరనేది ఆచూకీ లభించలేదు. రైల్వే పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.