Breaking News

రైతు సంక్షేమానికి పెద్దపీట

సారథి న్యూస్, హుస్నాబాద్: సంక్షేమంలో రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ వ్యవసాయ మార్కెట్ పాలకమండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు నిర్మించి బీడు భూముల్లో పచ్చని పంటలు పండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. రైతుబంధు పథకాన్ని అమలుచేసిన ఘనత టీఆర్ఎస్ కే దక్కిందన్నారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆవుల రాధతో పాటు పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, వైస్ చైర్మన్ రాజీరెడ్డి, జడ్పీటీసీ శ్యామల, ఎంపీపీ కీర్తి పాల్గొన్నారు.