Breaking News

రూల్స్‌ను అధిగమించడం ఎలా

ముంబై: క్రికెట్‌ను రీస్టార్ట్‌ చేశాక.. కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర అన్నాడు. ముఖ్యంగా కొత్త గైడ్‌లైన్స్‌ విషయంలో గందరగోళం చోటు చేసుకుంటుందన్నాడు. వీటిని క్రికెటర్లు ఎలా అధిగమిస్తారో చూడాలన్నాడు. ‘ఫాస్ట్‌ బౌలర్‌ అయినా, స్పిన్నరైనా బాల్‌ను షైన్‌ చేసేందుకు మొగ్గు చూపుతారు. దీని కోసం సలైవాను ఉపయోగిస్తారు. ఏళ్లుగా వస్తున్న అలవాటు ఇది. ఒక్కసారి దీనిని మర్చిపోవాలంటే సాధ్యం కాదు.

క్రికెట్‌ సోషల్‌ గేమ్‌. ఎక్కువ టైమ్‌ మనం డ్రెస్సింగ్‌ రూమ్‌లో గడుపుతాం. టాకింగ్‌, చాటింగ్‌ చేస్తుంటాం. ఇప్పుడు ఇవన్నీ లేకపోవచ్చు. నో వామప్‌. రావడం క్రికెట్‌ ఆడడం ఇంటికి వెళ్లిపోవడం. అంతా ఓ లెక్క ప్రకారం చేయాల్సిందే. ఇలాంటి నిర్బంధ రూల్స్‌ను క్రికెటర్లు ఎలా డీల్‌ చేస్తారన్నది ఆసక్తికరం’ అని సంగ పేర్కొన్నాడు.