Breaking News

యువతను ప్రభుత్వం మోసం చేస్తోంది

యువతను ప్రభుత్వం మోసం చేస్తోంది

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తూ పబ్బం గడుపుతోందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఆర్.మానస కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఏఐవైఎఫ్ ​ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం ఇస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువత ఓట్లను దండుకున్నారని అన్నారు. ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో యువజన ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్​ నగర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా కోకన్వీనర్ విజయ్, సురేందర్, రేణిగుంట ప్రీతమ్​, బలరాం, దేవేందర్, జె.మల్లేష్, రమేష్, శ్యామ్ పాల్గొన్నారు.