Breaking News

యార్క్ షైర్ అశ్విన్ డీల్ రద్దు

యార్క్ షైర్ అశ్విన్ డీల్ రద్దు

లండన్‌: టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఇంగ్లండ్‌ కౌంటీ యార్క్ షైర్‌తో ఉన్న ఒప్పందం రద్దయింది. కరోనా మహమ్మారి పెరుగుతుండడం, జులై 1వ తేదీ వరకు క్రికెట్‌ జరగదని ఈసీబీ స్పష్టం చేయడంతో ఇద్దరి ఆమోదం మేరకు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు.

ఈ ఏడాది జనవరిలో యార్క్ షైర్‌తో అశ్విన్‌ ఒప్పందం చేసుకున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మెజారిటీ మ్యాచ్‌లు ఆడే చాన్స్‌ ఉండేది. ఇక కేశవ్‌ మహారాజ్‌ (సౌతాఫ్రికా), నికోలస్‌ పూరన్‌ (వెస్టిండీస్‌) డీల్స్ను కూడా యార్క్ షైర్‌ రద్దు చేసుకుంది. ‘మా నిర్ణయాన్ని అంగీకరించినందుకు ప్లేయర్లను అభినందిస్తున్నాం.

ఈ కష్టకాలంలో వాళ్లతో మేం టచ్‌లోనే ఉంటాం. మా క్రికెటర్లంతా ప్రొఫెషనల్స్‌. ప్రస్తుతం కౌంటీలు ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితులను వాళ్లు అర్థం చేసుకున్నారు. ఫ్యూచర్‌లో మళ్లీ వాళ్లతో కలిసి పని చేస్తాం’ అని యార్క్షైర్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ మార్టిన్‌ మోక్సన్‌ వెల్లడించాడు.