![మేమున్నామని..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/mdk-2.jpg?fit=611%2C326&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: మానవతా హృదయం పరిమళించింది. ఆపదలో ఉన్నవారికి చేయూతనందించింది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న 20 మంది ఫ్రెండ్స్ కలిసి హెల్పింగ్ హ్యాండ్స్గ్రూప్ ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇటీవల మెదక్ జిల్లా రామాయంపేట చల్మేడ గ్రామానికి చెందిన రైతు తిర్మలయ్య ఇటీవల మరణించాడు. గ్రూపు మెంబర్స్ లో ఒకరైన సోదరుడికి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ వారి ఆర్థిక పరిస్థితిని వివరించారు. హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు రూ.51వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ బాల్ రెడ్డి, ఎఈవో గణేష్, ఉపసర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.