![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/SUSHMITHAAAFF.jpg?fit=1200%2C720&ssl=1)
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ అనే ఓ బ్యానర్ను స్థాపించి వెబ్సీరిస్ను నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఆమె తన తల్లి సురేఖ చేతుల మీదగా ఈ ఓ వెబ్సిరీస్ను ప్రారంభించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ కీలకపాత్ర పోషిస్తుండగా.. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. కొన్నిరోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. కానీ కరోనాతో ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. దీంతో సుష్మితా చాలా నిరుత్సాహానికి గురయ్యారట. సుష్మిత టీంలోని ఓ వ్యక్తికి కరోనా సోకడంతో టీం మెంటర్స్ అంతా క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. సదరు వ్యక్తికి సన్నిహితంగా ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు చేయించారు. త్వరలోనే షూటింగ్ను తిరిగి ప్రారంభిస్తామని నమ్మకంతో ఉందట సుష్మిత.