Breaking News

మెగాడాటర్​ ప్రాజెక్ట్​కు బ్రేక్​

మెగాస్టార్​ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ‘గోల్డ్​ బాక్స్​ ఎంటర్​టైన్​మెంట్స్​’ అనే ఓ బ్యానర్​ను స్థాపించి వెబ్​సీరిస్​ను నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఆమె తన తల్లి సురేఖ చేతుల మీదగా ఈ ఓ వెబ్​సిరీస్​ను ప్రారంభించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​ కీలకపాత్ర పోషిస్తుండగా.. ‘ఓయ్​’ ఫేమ్​ ఆనంద్​ రంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. కొన్నిరోజుల పాటు షూటింగ్​ కూడా చేశారు. కానీ కరోనాతో ప్రస్తుతం షూటింగ్​ నిలిచిపోయింది. దీంతో సుష్మితా చాలా నిరుత్సాహానికి గురయ్యారట. సుష్మిత టీంలోని ఓ వ్యక్తికి కరోనా సోకడంతో టీం మెంటర్స్​ అంతా క్వారంటైన్​లోకి వెళ్లిపోయారు. సదరు వ్యక్తికి సన్నిహితంగా ఉన్నవారికి కోవిడ్​ పరీక్షలు చేయించారు. త్వరలోనే షూటింగ్​ను తిరిగి ప్రారంభిస్తామని నమ్మకంతో ఉందట సుష్మిత.