Breaking News

మావోయిస్టులకు నగదు

  • అటవీ అధికారి అరెస్టు

సారథి న్యూస్​, కొత్తగూడెం: మావోయిస్టులకు నగదు తీసుకెళ్తున్నారనే కారణంతో గురువారం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.ఆరులక్షల వసూలు చేసి కారులో తీసుకెళ్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి వద్ద పోలీసుల తనిఖీచేసి పట్టుకున్నారు. నిందితుల్లో భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పాల్వంచకు చెందిన బండి వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్‌ ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.ఆరు లక్షలు, కారు, టూవీలర్​, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.