![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/DOCTORRRRFF.jpg?fit=700%2C463&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని తెలంగాణ సైకాలజిస్ట్ అసోషియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగులో ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా ప్రపంచాన్నివణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అయిలయ్య, రేష్మ, శివ కుమార్, ఆర్ సుధాకర్ రావు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.