![మహిళలకు అండగా ‘వైఎస్సార్చేయూత’](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/PANYAM-2.jpg?fit=655%2C357&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.18,750 ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గురువారం పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 19వ వార్డ్, పోర్త్క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా వచ్చిన డబ్బుతో ఏర్పాటు చేసుకున్న కిరాణ షాపును నగరపాలక సంస్థ కమిషనర్ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డీకే బాలాజీ ప్రారంభించారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వైఎస్సార్చేయూత పథకాన్ని అమలుచేశారని తెలిపారు. రాష్ట్రమంతా అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.