Breaking News

మహాదేవపురంలో ఒకరికి కరోనా

మహాదేవపురంలో ఒకరికి కరోనా

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామంలో కరోనా(కోవిడ్​–19) పాజిటివ్ కేసు నమోదైనట్లు డీఎంహెచ్​వో మాలతి సోమవారం తెలిపారు. ఇటీవల ఆ గ్రామానికి ముంబై నుంచి 17 మంది ప్రత్యేకబస్సులో వచ్చారు. వారిలో ఏడుగురిని కరోనా టెస్ట్​లకు పంపించగా, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు.