![మహాదేవపురంలో ఒకరికి కరోనా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/khammam-1.jpeg?fit=1280%2C719&ssl=1)
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామంలో కరోనా(కోవిడ్–19) పాజిటివ్ కేసు నమోదైనట్లు డీఎంహెచ్వో మాలతి సోమవారం తెలిపారు. ఇటీవల ఆ గ్రామానికి ముంబై నుంచి 17 మంది ప్రత్యేకబస్సులో వచ్చారు. వారిలో ఏడుగురిని కరోనా టెస్ట్లకు పంపించగా, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు.