Breaking News

మమ్మల్ని ఆదుకోండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులందరికీ స్పెషల్​ ఇన్సెంటివ్​, ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలని యూనియన్​ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సింగరేణి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్​కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్, రీజియన్ కార్యదర్శి శనిగల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు శనిగరపు చంద్రశేఖర్, ఏఐటీయూసీ సింగరేణి ఏరియా ఆసుపత్రి విభాగం ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్, మోహన్, శంకర్, సర్వేశ్​, రమేశ్​, చంద్రకళ, ఆదిలక్ష్మి, నాగమణి, స్వరూప, మాధవి, జానకి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.