Breaking News

భద్రాద్రి ఎస్పీపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

షార్ట్ న్యూస్

సారథి న్యూస్​, హైదరాబాద్: సివిల్‌ వివాదంలో తలదూర్చి తనను భదాద్రి-కొత్తగూడెం ఎస్పీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. పాల్వంచ ఎస్సైతో కలిసి తన ఐదెకరాల పొలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కార్యాలయానికి పిలిపించి ఎస్పీ బెదిరించారని ఆరోపించారు.ఈ పిటిషన్‌పై హెచ్‌ఆర్సీ తీవ్రంగా స్పందించింది. సివిల్‌ వివాదంలో ఈ ఘటనపై ఒక ఆర్డీవో ర్యాంకు స్థాయి అధికారితో విచారణ జరిపించాలని భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. సమగ్ర నివేదికను జూలై 31న తమకు సమర్పించాలని సూచించింది.