Breaking News

బతకాలంటే.. బట్ట కట్టాల్సిందే

బతకాలంటే.. బట్ట కట్టాల్సిందే

సారథి న్యూస్, నర్సాపూర్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తున్న కరోనాను జయించాలంటే ప్రతిఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్వకుండా ఉండాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. బతికి ఉండాలంటే ప్రతిఒక్కరూ మూతులకు బట్ట కట్టాల్సిందేనని. లేదంటే ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు. శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిలిపిచెడ్ మండలంలోని 250 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శేషసాయిరెడ్డి, ఎంపీపీ వినోద పాల్గొన్నారు.