Breaking News

ఫిల్టర్​ నీటినే తాగండి

సారథి న్యూస్​, నర్సాపూర్​: ప్రతిఒక్కరూ శుద్ధమైన నీటినే తాగాలని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కౌడిపల్లి మండలం రాయిలాపూర్ లో గ్రామ సామాజిక అభివృద్ధి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలంతా శుద్ధిచేసిన నీటినే తాగాలని కోరారు. అనంతరం మంత్రి హరీశ్​రావు బర్త్​ డే సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. కార్యక్రమంలో మెదక్​ జిల్లా అడిషనల్​ జేసీ నగేష్, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, ఎంపీపీ రాజు నాయక్, జడ్పీటీసీ కవిత అమర్ సింగ్, సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు.