Breaking News

ప్రాణాలు తీసిన కరెంట్​

సారథి న్యూస్, షాద్​నగర్: విద్యుత్ షాక్ తో బాబాయ్, అబ్బాయి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో గురువారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్బాయి, బాబాయ్​గాండ్ల సురేష్(45), గాండ్ల అభిలాష్(18) పొలం వద్ద బోరు మోటార్ ను రిపేర్​ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇనుప పైపులను వెలికితీస్తుండగా పైనున్న11 కేవీ హై టెన్షన్ తీగలకు తగిలాయి. విద్యుత్​షాక్​తో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో మొగిలిగిద్దలో తీవ్ర విషాదం నెలకొంది.