Breaking News

ప్రణబ్​ ఆరోగ్యం.. మరింత విషమం

ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్​ కురువృద్ధుడు ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యం మరింత విషమించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి బులెటిన్​ను విడుదల చేసింది. ప్రణబ్​ ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని.. ఆయన ప్రస్తుతం ఉపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్​పైనే చికిత్స కొనసాగిస్తున్నట్టు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ఈ నెల 10న ప్రణబ్​ముఖర్జీ అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అదే రోజు ఆయనకు జరిపిన కరోనా పరీక్షలో పాటిటివ్​గా నిర్దారణ అయ్యింది.