Breaking News

ప్రజల వద్దకే చేపలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కులఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవితంలో వెలుగులు నింపాలన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్​ ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని పశువర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీసు ఆవరణలో మొబైల్ ఫిష్ అవుట్​ లెట్ ను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఫిష్ అవుట్​లెట్స్​ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి చేపలు విక్రయించడం ద్వారా ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.