![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/talasani.jpeg?fit=1080%2C720&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కులఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవితంలో వెలుగులు నింపాలన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని పశువర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీసు ఆవరణలో మొబైల్ ఫిష్ అవుట్ లెట్ ను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఫిష్ అవుట్లెట్స్ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి చేపలు విక్రయించడం ద్వారా ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.