![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/carona-virus-picgg.jpg?fit=830%2C553&ssl=1)
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని పోలీసులను కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మొత్తం 22 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఎస్ఆర్నగర్లో పీఎస్లో విధులు నిర్వర్తిస్తున్న మరో 9 మందికి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఒక క్రైంఎస్ఐ, ఏఎస్ఐ, ఏడు మంది కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అధిక సంఖ్యలో పోలీసులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో పోలీస్ యంత్రాంగంలో ఆందోళన నెలకొంది.