Breaking News

పోలీసులను వదలడం లేదు

సారథిన్యూస్​, హైదరాబాద్: రాష్ట్రంలోని పోలీసులను కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఎస్​ఆర్​నగర్​లో పీఎస్​లో విధులు నిర్వర్తిస్తున్న మరో 9 మందికి కూడా కరోనా పాజిటివ్​గా తేలింది. ఒక క్రైంఎస్ఐ, ఏఎస్‌ఐ, ఏడు మంది కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అధిక సంఖ్యలో పోలీసులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో పోలీస్‌ యంత్రాంగంలో ఆందోళన నెలకొంది.