Breaking News

దివ్యాంగులకు సరుకులు పంపిణీ

దివ్యాంగులకు సరుకులు పంపిణీ

        తెలంగాణ జాగృతి, దివ్యాంగులు

సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ సమయంలో హయత్​ నగర్, మన్సురాబాద్ డివిజన్ల పరిధిలో 60 మంది దివ్యాంగులకు తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నల్లగొండ శ్రీనివాసులు, వనస్థలిపురం డివిజన్ జాగృతి అధ్యక్షులు చింతల రవి బియ్యం, నిత్యావసర సరుకులను శనివారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు దివ్యాంగులకు సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అన్మగల్ హయత్ నగర్ డివిజన్ జాగృతి ఇన్​ చార్జ్​ మల్లికార్జున్ పాల్గొన్నారు.