![దళిత సర్పంచ్పై దాడిచేసిన వారికి శిక్షించాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/11/PDPT-2.jpg?fit=677%2C313&ssl=1)
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత సర్పంచ్పై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దళిత బహుజన హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగమేశ్వర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తుకారాం, దళిత సంఘాల జేఏసీ నాయకులు విజయ్కుమార్ మాట్లాడుతూ.. చిలపల్లి గ్రామంలో దళిత సర్పంచ్పై దాడిచేయడం హేయమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధులపై రాజకీయ నాయకులు దాడిచేస్తుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. అధికారులు స్పందించి కేసు నమోదుచేసి అరెస్టు చేయకపోతే జిల్లావ్యాప్తంగా దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ నాయకులు రోమాల సాయిలు, మాణిక్యం, సాయిలు, సురేష్, చీలపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.