Breaking News

తప్పుచేస్తే ఎవరైనా చర్యలు తప్పవు

తప్పుచేస్తే ఎవరైనా చర్యలు తప్పవు

సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో అరాచకాలు, అన్యాయాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవైన్ రామయ్య హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి నష్టం జరిగేలా ప్రవర్తిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల ఆదోని నియోజకవర్గ పరిధిలోని మండగేరీ గ్రామ సచివాలయ ఉద్యోగిపై అనుచితంగా ప్రవర్తించిన సురేష్ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. పార్టీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలపై పెత్తనం చేయాలని ఆలోచించే వారికి ఇది గుణపాఠం లాంటిదన్నారు. ఇలాంటి ఘటనలను సీఎం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోరని అన్నారు.