Breaking News

డిగ్రీ ఆన్ లైన్​ అడ్మిషన్స్.. దోస్త్ షెడ్యూల్

డిగ్రీ ఆన్ లైన్​ అడ్మిషన్స్.. దోస్త్ షెడ్యూల్

హైదరాబాద్​: ఎంసెట్‌, ఐసెట్ వంటి వాటికి ఆన్‌లైన్​లో అప్లై చేయడం, వెబ్ కౌన్సెలింగ్‌, వెబ్ఆప్షన్లు నమోదుచేయడం వంటివి మ‌న‌కు తెలుసు. కానీ రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో ముఖ్యంగా ఇంట‌ర్మీయట్‌, డిగ్రీ లెవెల్​లో అడ్మిష‌న్‌, ఎగ్జామ్స్ విష‌యంలో ఎలాంటి ఫ్రాడ్‌ జరిగేందుకు అవ‌కాశం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిష‌న్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ(దోస్త్‌)కు అనే ఆన్‌లైన్ ప్రాసెస్‌ను తీసుకొచ్చింది. మొత్తం డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌లైన్ ద్వారానే చేయనున్నారు.
షెడ్యూల్ ఇలా..
ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు మొదటి ఫేస్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. 29 నుంచి వచ్చేనెల 8 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది.. సెప్టెంబర్ 16న మొదటి ఫేజ్​ సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 23 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఫేస్ –2 రిజిస్ట్రేషన్స్ కు సంబంధించి రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుతో సెప్టెంబర్ 17 నుంచి 23వ తేదీ వరకు గడువు ఉంది. సెప్టెంబర్ 28న సీట్లు కేటాయిస్తారు. మూడో ఫేస్ రిజిస్ట్రేషన్స్ 400 ఫీజుతో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఉంటుంది. అలాగే అక్టోబర్ 8న సీట్ల కేటాయిస్తారు.