Breaking News

జులైలో ఇంగ్లండ్ వెళ్తాం

జులైలో ఇంగ్లండ్ వెళ్తాం
  • పాక్ క్రికెట్ బోర్డు

కరాచీ: కరోనాను పక్కనబెడుతూ పాకిస్థాన్, ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్ధమవుతోంది. మూడు టెస్ట్​లు, మూడు టీ20 కోసం జులైలో అక్కడ పర్యటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఈ పర్యటనపై క్రికెటర్లకు అనుమానాలు ఉంటే.. వాళ్లను రమ్మని బలవంతం చేయబోమని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ తెలిపాడు. ‘మ్యాచ్​లన్నీ ఖాళీ స్టేడియాల్లో జరుగుతాయి. గ్రౌండ్​లోనే హోటల్ రూమ్స్ ఉంటాయి. పర్యటనకు రావాలా? వద్దా? అనేది ప్లేయర్ల ఇష్టం. ఒకవేళ రాకపోయినా ఎలాంటి చర్యలు ఉండవ్​. మాతో ఆడేందుకు ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా సిద్ధంగా ఉన్నారు.

జులై తొలి వారంలో నాలుగు చార్టెడ్ ఫ్లయిట్స్​ లో మేం అక్కడికి వెళ్తాం. కొన్ని రోజుల క్వారంటైన్ తర్వాత మాంచెస్టర్, సౌత్​ ఆంప్టన్​లో మాత్రమే మ్యాచ్​ లు ఉంటాయి. మెడికల్ సిబ్బంది, బయో సెక్యూర్ ఏర్పాట్లు ఉంటాయి’ అని వసీమ్ పేర్కొన్నాడు. టెస్ట్​ కెప్టెన్‌ అజర్‌అలీ, పరిమిత ఓవర్ల కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు వచ్చే వారం ఈ పర్యటన గురించి చెబుతానన్న వసీమ్ ప్లేయర్లకు కూడా వెల్లడిస్తానన్నాడు.