Breaking News

చిన్నశంకరంపేటలో ఇద్దరికి కరోనా

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. స్థానిక పీహెచ్​సీలో సోమవారం 17 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో మడూర్, చందాపూర్ గ్రామాలకు చెందిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తెలిపారు. నేటితో మండలంలో 13 మందికి పాజిటివ్ రాగా నలుగురు రికవరీ అయ్యారని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.