![ఘనంగా మే డే](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/gdk1.jpeg?fit=1077%2C497&ssl=1)
సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ), అర్జీ1 కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఆఫీస్, ఏరియా వర్క్ షాప్, రమేష్ నగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, కనకయ్య, మహేష్, మెండ శ్రీనివాస్, జె.గజెందర్, సానం రవి, అంజయ్య, కె రంగారావు, వంగల రాములు పాల్గొన్నారు.